News October 3, 2024
గడియారం గుర్తును వాడకుండా అజిత్ను అడ్డుకోండి: శరద్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.
Similar News
News January 10, 2026
చిరు మూవీ టికెట్ ధరలు పెంపు.. HCలో పిటిషన్

TG: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్(అత్యవసర విచారణ) దాఖలైంది. దీనిపై సెలవుల తర్వాత విచారిస్తామని కోర్టు పేర్కొంది. ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతిస్తూ, రెగ్యులర్ షోల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల <<18809035>>రాజాసాబ్<<>> టికెట్ల పెంపుపై HC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే MSVP బుకింగ్స్ మొదలయ్యాయి.
News January 10, 2026
నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు.
News January 10, 2026
భారీ స్కోరు చేసిన గుజరాత్ జెయింట్స్

WPL-2026లో యూపీ వారియర్స్తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 207-4 స్కోరు చేసింది. కెప్టెన్ గార్డ్నర్(65) అర్ధసెంచరీతో అదరగొట్టగా అనుష్క(44), సోఫీ డివైన్(38) సహకారం అందించారు. చివర్లో జార్జియా మెరుపులు మెరిపించి 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్తో 27* రన్స్ చేయడంతో స్కోరు బోర్డు 200 దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు, శిఖా పాండే, డాటిన్ తలో వికెట్ తీశారు. UP టార్గెట్ 208.


