News October 3, 2024
ధర్మారెడ్డి ఎక్కడ?: పవన్
AP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. తన బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి వచ్చిన ధర్మారెడ్డి లడ్డూ వివాదం రాగానే మాయమయ్యారని ఆక్షేపించారు. ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రస్తుత ఈవో చెప్పారన్నారు.
Similar News
News October 9, 2024
ఇవాళ ఈ శ్లోకాన్ని పఠించండి!
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.
News October 9, 2024
కులగణనకు సిద్ధమైన ప్రభుత్వం!
TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.
News October 9, 2024
కోహ్లీ రికార్డుకు దగ్గర్లో సూర్య
బంగ్లాదేశ్తో టీమ్ఇండియా ఈరోజు రెండో టీ20 ఆడనుంది. ఈమ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.