News October 4, 2024

ఒక్కో కార్మికుడికి ₹1.92 ల‌క్ష‌ల జీతం, ₹16,515 బోన‌స్‌

image

పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్ప‌డిన కార్మికుల కొర‌త భార‌తీయుల‌కు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో ప‌నిచేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 ల‌క్ష‌ల జీతం, ₹16,515 బోన‌స్‌, వైద్య బీమా, వ‌స‌తి ల‌భిస్తోంది. ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నా స‌రే భార‌తీయులు అక్క‌డ ప‌నిచేయ‌డానికి క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.

Similar News

News October 8, 2024

గుండెలను పిండేసే ఘటన

image

AP: అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు శ్యామ్(5) చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి శిరీష తల్లడిల్లింది. ఆస్పత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. ‘కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు.. నిద్రలే’ అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని ఆమె చెప్పడంతో తండ్రి, కుటుంబసభ్యులు విలపించారు.

News October 8, 2024

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్‌లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం భక్తులు sabarimalaonline.org వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.

News October 8, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.