News October 4, 2024

NRPT: ‘సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త’

image

దసరా సెలవులకు వేరే వుళ్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయాలని, ఇళ్లలో విలువైన ఆభరణాలు, డబ్బులు వుంచారదని, ఇంటి బయట 24 గంటలు లైట్లు వెలిగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో దొంగలు చేతివాటం చూపుతారని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అన్నారు.

Similar News

News January 17, 2026

MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.

News January 17, 2026

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణా నుండే రావాలి- CM

image

దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

News January 17, 2026

మరికాసేపట్లో ఎంవీఎస్ మైదానానికి సీఎం రేవంత్

image

మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి భారీ నిధులతో కూడిన ప్రాజెక్టులకు ఆయన ఇక్కడ నుంచి పునాది వేయనున్నారు. సభ కోసం మైదానానికి జనం భారీగా చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.