News October 4, 2024
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ సతీశ్

ప్రజలు, పోలీసులు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. చేబ్రోలు మండలంలోని గొడవర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆయన వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా కలిసి మెలసి ఉంటే ఎటువంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 14, 2026
GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.
News March 14, 2026
గుంటూరు: కోర్టు మెట్లపై మళ్లీ ఒక్కటైన ఆరు జంటలు

గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్లో వరకట్న వేధింపులు, భరణం కేసులతో కోర్టును ఆశ్రయించిన ఆరు జంటలను న్యాయమూర్తి లత చొరవతో తిరిగి కలిపారు. దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి దాంపత్య బంధాన్ని కొనసాగించేందుకు ఒప్పించారు. న్యాయమూర్తి లత కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రక్రియలో సహకరించిన న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2026
తుళ్లూరు: CMరాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న తుళ్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఈ కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులో ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.


