News October 4, 2024
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 25, 2025
బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.
News December 25, 2025
బైక్స్, కార్ల వెంట కుక్కల పరుగులు.. కారణమేంటి?

స్పీడ్గా వెళ్లే బైక్స్, కార్లను చూస్తే కుక్కల్లో వేటాడే స్వభావం బయటపడుతుంది. హారన్, ఇంజిన్, సైలెన్సర్ సౌండ్స్తో ఉద్రేకం పెరిగి వెంటపడతాయి. వాహనాల పొగ నుంచి వచ్చే స్మెల్ కూడా కారణం కావొచ్చు. కొన్ని వీధి కుక్కలు అవి తిరిగే రోడ్డును తమ ప్రాంతంగా భావిస్తాయి. అక్కడికి వచ్చిన వాహనాల వెంట పరిగెడతాయి. కుక్కలు అన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయని చెప్పలేం. కొన్ని మాత్రమే వాహనాల వెంట పరిగెడుతూ ఇబ్బంది పెడతాయి.
News December 25, 2025
ఇంటి వాస్తు ఆ ఇంట్లో ఎవరున్నా వర్తిస్తుందా?

ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వేర్వేరు కుటుంబాలకు ఒకే రకమైన ఫలితాలు ఉండకపోవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇంటి వాస్తు బాగున్నా, అదృష్టం అనేది ఆ వ్యక్తి పేరుబలం, జన్మరాశి, సింహాద్వార అనుకూలతపై ఆధారపడి ఉంటుందన్నారు. ‘ఇంటి గదులను శాస్త్రోక్తంగా వాడుకోవడం, పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడం, దైనందిన కార్యక్రమాలను నియమబద్ధంగా పాటించడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు వస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


