News October 4, 2024
అయిజ: ఈ ప్రాంతంలో నీటి సరఫరా నిలిపివేత
అయిజ మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ ప్రాంతాలకు నేడు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని పాత పోలీస్ స్టేషన్ భవనం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యిందని, దానికి మరమ్మతు చేసి కాంక్రీట్ వేశారని, దీంతో శుక్రవారం పాత బస్టాండ్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నిలిపేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 4, 2024
రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
News October 4, 2024
సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
News October 4, 2024
NGKL: వరి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
వానా కాలంలో రైతులు సాగుచేసిన వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్లో 244, నారాయణపేటలో 95 జోగులాంబ గద్వాలలో 55, వనపర్తిలో 244, మహబూబ్నగర్లో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.