News October 4, 2024

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

image

గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News March 25, 2026

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 25, 2026

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 25, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.