News October 4, 2024
కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ
కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.
Similar News
News October 4, 2024
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్గా రవినాయుడు బాధ్యతలు
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 4, 2024
విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన రామవరప్పాడు రింగ్-మహానాడు రోడ్డు వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో ఇటీవల నిర్మించిన ఈ తరహా ఫ్లైఓవర్ మాదిరిగా 6.5కి.మీ. మేర మహానాడు రోడ్డు-నిడమానూరు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ సైతం నిర్మించనున్నట్లు సమాచారం.
News October 3, 2024
తిరువూరు: శావల దేవదత్కు శుభాకాంక్షల వెల్లువ
తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.