News October 4, 2024
IPL: వీరిని ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదల్లేదు

ఐపీఎల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదులుకోలేదు. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్కే, విరాట్ కోహ్లీ-ఆర్సీబీ, సచిన్ టెండూల్కర్-ముంబై ఇండియన్స్, సునీల్ నరైన్-కేకేఆర్, రిషభ్ పంత్-డీసీ ఉన్నారు. వీరిలో ధోనీ మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు. IPL-2025 సీజన్కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా. వీరి రిటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
Similar News
News March 17, 2026
BIG ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. TGలో నేటి నుంచి 23వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, HYD, మేడ్చల్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అటు APలో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.
News March 17, 2026
GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు

AP: గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. PMAY-రూరల్ 2.O స్కీమ్ కింద మంజూరు చేసే ఇళ్ల ధరను ₹1.20 లక్షల నుంచి ₹2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో కేంద్ర వాటా ₹72వేలు, రాష్ట్ర వాటా ₹48 వేలు ఉంటుంది. అదనంగా జీ రామ్ జీ కింద 90 పని దినాలకు కన్వర్జెన్స్ రూపంలో ₹27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ₹12వేలు, SHG లోన్పై వడ్డీ రాయితీ ₹80వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.
News March 17, 2026
‘ప్రభుత్వ’ ఇళ్లను అద్దెకు ఇస్తే రద్దు: పొంగులేటి

TG: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండని, అద్దెకు ఇస్తున్న వారికి నోటీసులివ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మే 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, నోటీసులకు స్పందించకపోతే ఇళ్లను రద్దు చేయాలని సూచించారు. వాటిని అర్హులకు కేటాయించాలన్నారు. నోటీసులకు స్పందించిన వారితో తాము ఆ ఇంట్లోనే ఉంటామని, లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తామని బాండు పేపర్పై రాయించుకోవాలని పేర్కొన్నారు.


