News October 4, 2024
విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు

జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.
Similar News
News September 21, 2025
సమయపాలన పాటించని జీవీఎంసీ సిబ్బంది?

జీవీఎంసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికే విధులకు హాజరుకావాలని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ఆదేశించారు. శనివారం విశాఖలో అన్ని జోన్ల సిబ్బందితో సమావేశమై ఉదయం9:30 నుంచి సా.5:30 వరకు వీధులు నిర్వహించాలని సూచించారు. చాలాచోట్ల మధ్యాహ్నం విధులకు హాజరు కావడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ పూర్తి చేసి పంపించాలని, పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
News September 21, 2025
గూగుల్ డేటా సెంటర్కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.
News September 21, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణపై సమీక్ష

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణపై MLAగంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షించారు. గ్రామంలో సబ్రిజిస్ట్రార్ ధర ఎకరానికి రూ.17లక్షలు ఉందని, D.పట్టా భూములకు ఎకరానికి రెండున్నర రెట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. 520మంది రైతులకు వారి భూముల స్వరూపాన్ని బట్టి పరిహారం అందిస్తామన్నారు. గూగుల్ డేటా సెంటర్లో రైతుల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు.