News October 4, 2024

విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు

image

జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.

Similar News

News March 12, 2026

మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

image

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2026

విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

image

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది

News March 12, 2026

విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలకు అంతా రెడీ

image

ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు విశాఖ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 133 పరీక్షా కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 456 స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. 8 స్కూల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్స్ స్క్వాడ్స్ పర్యవేక్షణ చేయనున్నాయి.