News October 4, 2024
ముస్లింల సభ్యత్వం పెరుగుతోంది: బీజేపీ
UPలో తమకు ముస్లిం ఓటర్ల సభ్యత్వం పెరుగుతోందని BJP తెలిపింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా Sep 30 నాటికి 4.12 లక్షల మంది ముస్లింలు మెంబర్షిప్ పొందినట్టు వెల్లడించింది. ఇది 2014లో నమోదైన 1.25 లక్షల కంటే మూడింతలు అధికమని పేర్కొంది. కార్యక్రమం విజయవంతం కోసం మదర్సాలు, దర్గాలు, విద్యా సంస్థల వద్ద క్యాంపుల ఏర్పాటు సహా ప్రముఖ మత సంస్థలతో BJP భేటీ అవుతోంది.
Similar News
News October 7, 2024
రేపు కోర్టుకు హీరో నాగార్జున
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. తన స్టేట్మెంట్ తెలిపేందుకు రేపు కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. ఈమేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.
News October 7, 2024
‘మహారాజ’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్కు నిర్మాతలు సర్ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ వ్యూస్లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.
News October 7, 2024
ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రతన్ టాటా
బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. వృద్ధాప్యం దృష్ట్యా తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు.