News October 4, 2024

మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్

image

రక్షణ విషయంలో భారత్‌కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్‌వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.

Similar News

News October 4, 2024

BIG BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.

News October 4, 2024

కమల తరఫున ప్రచార బరిలోకి బరాక్ ఒబామా

image

డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. క‌మ‌ల అభ్య‌ర్థిత్వ నామినేష‌న్‌కు ఒబామా, ఆయ‌న స‌తీమ‌ణి మిచెల్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వింగ్ ఓటర్లే లక్ష్యంగా Oct 10న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఒబామా మొదటి ప్రచార స‌భ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈ స‌భ‌లో క‌మ‌ల కూడా పాల్గొనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

News October 4, 2024

వేగంగా పచ్చబడుతున్న అంటార్కిటికా!

image

తెల్ల దుప్పటి కప్పుకొని కనిపించే అంటార్కిటికా పర్యావరణ మార్పు కారణంగా పచ్చబడుతోంది. పరిశోధకులు ఈ విషయాన్ని నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో తెలిపారు. గడచిన 4 దశాబ్దాల్లో అంటార్కిటికా పచ్చదనం 10 రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 1986లో 0.4 చదరపు మైళ్లున్న పచ్చదనం 2021 నాటికి 5 చదరపు మైళ్ల విస్తీర్ణానికి చేరిందని వెల్లడించారు. ఈ మార్పు భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు.