News October 4, 2024
ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.
Similar News
News March 24, 2026
కక్ష ఉంటే నాపై తీర్చుకోండి: KTR

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని KTR అన్నారు. ACB <<19460633>>ఛార్జ్షీట్పై<<>> ఆయన స్పందించారు. ‘ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరగలేదు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగాయి. తప్పు చేయని అధికారులను ఎందుకు ఇరికించారు. కక్ష ఉంటే నాపై తీర్చుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ‘లొట్టపీసు కేసు అయితే భయమెందుకు? ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని కౌంటరిచ్చారు.
News March 24, 2026
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

AP: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ చేపట్టిన బోర్డు ఫలితాలను APR 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 8లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. సిలబస్ మారడం, సబ్జెక్టుల ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల 30రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటివారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది.
News March 24, 2026
రామ్ పోతినేని కొత్త సినిమా ఫిక్స్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్కు అసోసియేట్గా పనిచేసిన లోగి విఘ్నేశ్తో ఆయన సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాయి. కథా చర్చలు జరిగాయని, హీరో స్టోరీని ఓకే చేశారని తెలిపాయి. 2026లోనే రిలీజయ్యే ఛాన్సుందని చెప్పాయి. కాగా రామ్ చివరగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాని సంగతి తెలిసిందే.


