News October 4, 2024
మీరు ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవ్వాలి?: సుప్రీంకోర్టు

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యాన్ని SC ఆక్షేపించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికకు అదేశాలు సహా ప్రిసైడింగ్ అధికారిని నియమించడాన్ని తప్పుబట్టింది. ‘కమిటీ మీటింగ్కి మేయర్ అధ్యక్షత వహించాలి. మీకు అధికారం ఎక్కడిది? 487 కిందనా?. అది కార్యనిర్వాహక శక్తి. మీరు ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవ్వాలి?’ అని ప్రశ్నించింది.
Similar News
News February 13, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. UPDATES

*యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
*కాగజ్నగర్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
*ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా) 13, 15వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం
*కొల్లాపూర్ 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 4, 11, 12 వార్డుల్లో BRS విజయం
*రామాయంపేట పదో వార్డులో BRS గెలుపు
News February 13, 2026
పిల్లలకు పాలు అరగాలంటే..!

పసిపిల్లలు పాలు తాగిన తర్వాత కచ్చితంగా బర్పింగ్ చేయించాలి. లేదంటే వారు తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లలను బర్పింగ్ చేయించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని సున్నితంగా భుజంపై పెట్టుకొని నెమ్మదిగా వీపును సవరదియ్యాలి. లేదంటే బేబీని ఒళ్లో కూర్చోబెట్టుకొని కాస్త ముందుకు వంచి వీపును సవరదియ్యాలి. ఇలా త్రేన్పులు వచ్చే వరకు చెయ్యాలని చెబుతున్నారు.


