News October 4, 2024
దేశంలో మళ్లీ ఎగ్జిట్ పోల్స్ సందడి

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జమ్మూకశ్మీర్, హరియాణ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల తరువాత పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే JK ఎన్నికలు ముగిశాయి. శనివారం హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత ఫలితాల అంచనాలు వెలువడనున్నాయి.
Similar News
News January 30, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*మేడారం జాతర.. గద్దెపైకి సమ్మక్క
*రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: పవన్
*రాజకీయ స్వార్థానికి లడ్డూను వాడుకోవడం దురదృష్టకరం: గుడివాడ అమర్నాథ్
*ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని KCRకు సిట్ నోటీసులు
*రేపు విచారణకు రాలేనన్న కేసీఆర్.. అంగీకరించిన సిట్
*మేడిగడ్డ బ్యారేజీని అత్యంత ప్రమాదకర కేటగిరీలో చేర్చిన కేంద్రం
*WPL: ఫైనల్కు దూసుకెళ్లిన RCB
News January 30, 2026
రాష్ట్రానికి రూ.128.43 కోట్ల NHM నిధులు

AP: జాతీయ ఆరోగ్య మిషన్ చివరి విడత కింద ఆయా జిల్లాలకు ప్రభుత్వం రూ.128.43 కోట్లను విడుదల చేసింది. FEB 20లోగా వీటిని ఖర్చు చేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా గుంటూరుకు రూ.20.61 కోట్లు, నెల్లూరుకు రూ.8.60 కోట్లు, కృష్ణాకు రూ.6.21 కోట్లు ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
News January 30, 2026
కళ్లు మూసి తెరిచేలోపే SMలో ఇంత జరుగుతుందా?

సోషల్ మీడియాలో ఒక్క సెకనులో ఏం జరుగుతుందో గూగుల్ GEMINI ఆసక్తికర డేటాను వెల్లడించింది. దీని ప్రకారం సెకనుకు వాట్సాప్లో 10 లక్షల మెసేజ్లు, ఇన్స్టాలో 1,000 ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయి. ‘X’లో 10 వేల ట్వీట్స్ చేస్తుంటే గూగుల్లో లక్షకు పైగా సెర్చ్లు జరుగుతున్నాయి. ఇక యూట్యూబ్లో 90 వేల వీడియోలు చూస్తున్నారు. మనం కనురెప్ప వేసి తెరిచేలోపు డిజిటల్ ప్రపంచం ఇంతలా కదులుతోందన్నమాట.


