News October 4, 2024

తూ.గో: 7న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈనెల 7న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. 7న ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు.

Similar News

News August 21, 2025

భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

image

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

News August 21, 2025

భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

image

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

News August 21, 2025

రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్‌ తనిఖీ

image

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.