News October 5, 2024

చంద్రప్రభ వాహనం మీద ఊరేగుతున్న భద్రకాళి అమ్మవారు

image

భద్రకాళి అమ్మవారిని మకర వాహనం మీద గంగాభవానిగా, చంద్రప్రభ వాహనం మీద అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించారు. మకర వాహనం మీద గంగాభవానిగా అమ్మవారిని దర్శించడం వల్ల జలగండాలు దూరమవుతాయని అర్చకులు తెలిపారు. చంద్రప్రభ వాహనం మీద రాజరాజేశ్వరిగా ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడు చంచలత్వాన్నివీడి మనస్సు స్థిరమై సాధనలో నిమగ్నమవుతాడని చెప్పారు.

Similar News

News October 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: జిల్లాలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం
> BHPL: చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ స్వల్ప గాయాలు
> MHBD: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
> JN: ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
> BHPL: రేగొండలో బైకును ఢీ కొట్టిన వ్యాన్.. వ్యక్తికి గాయాలు
> MLG: లారీలతో రోడ్డుపై ప్రజల ఇబ్బందులు
> HNK: సఖి కేంద్ర సేవలపై ప్రజలకు అవగాహన సదస్సు

News October 4, 2024

వరంగల్: తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.

News October 4, 2024

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.