News October 5, 2024
మెదక్: పక్కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన: అదనపు కలెక్టర్

డిఎస్సీ 2024లో అర్హత సాధించిన 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డీఎస్సీ 2024లో 704 ఎంపికయ్యారని 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతుండగా గురువారం సందర్శించారు. మొత్తం 704 మంది అభ్యర్థులకుగాను 618 మంది అభ్యర్థులు వచ్చారు.
Similar News
News April 4, 2026
మెదక్: ఇంటర్తో పాటు ఐఐటీ, జేఈఈ ప్రారంభం: ఎస్వో

మెదక్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో(కేజీబీవీ) యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగంగా ఇంటర్మీడియట్, ఐఐటీ, జేఈఈ ప్రారంభిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ కవిత తెలిపారు. ఆసక్తి గల పదో తరగతి విద్యార్థినిలకు సంబంధించిన వెబ్ పోర్టల్ నందు అర్హత పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈనెల 15లోగా దరఖాస్తు చేయాలని, మే 3న పరీక్ష ఉంటుందన్నారు.
News April 3, 2026
పీడీఎస్ సేవలు పారదర్శకంగా ఉండాలి: నిత్యానంద్

టేక్మాల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News April 2, 2026
మెదక్: ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83% హాజరు

మెదక్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 11,247 మందికి గాను 11,228 మంది పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.


