News October 5, 2024
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత: మంత్రి దుర్గేష్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపులు కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.
Similar News
News August 21, 2025
భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.
News August 21, 2025
భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.
News August 21, 2025
రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్ తనిఖీ

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్సీఐ గోడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.