News October 5, 2024

పెరగనున్న పత్తి ధరలు?

image

TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో నిన్న కొత్త పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్‌లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News September 17, 2025

MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

image

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.

News September 17, 2025

ICC ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా హవా

image

ICC తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా సత్తా చాటింది. వన్డే, T20 ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచింది. No.1 వన్డే బ్యాటర్‌గా గిల్, No.1 T20 బ్యాటర్‌గా అభిషేక్, No.1 టెస్ట్ బౌలర్‌గా బుమ్రా, No.1 T20 బౌలర్‌‌గా వరుణ్ చక్రవర్తి, No.1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా జడేజా, No.1 టీ20 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ నిలిచారు. అటు స్మృతి మంధాన ఉమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరారు.

News September 17, 2025

ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్.. APPLY

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. SHARE IT.