News October 5, 2024
T20 వరల్డ్ కప్లో నేటి మ్యాచులు

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో భాగంగా మ.3.30కి ఆస్ట్రేలియాతో శ్రీలంక, గ్రూప్-Bలో భాగంగా రా.7.30కి ఇంగ్లండ్తో బంగ్లాదేశ్ తలపడతాయి. నిన్న జరిగిన మ్యాచుల్లో ఇండియాపై న్యూజిలాండ్, వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2026
ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చారు: వైసీపీ

కూటమి ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని వైసీపీ విమర్శించింది. నాడు వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి.. నేడు రాష్ట్రం మొత్తం గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తోందని ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు, వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగితేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కుమిలిపోతున్నారని పేర్కొంది.
News March 17, 2026
ఓడ నుంచి సిలిండర్లలోకి LPG.. ప్రాసెస్ ఇదే!

‘నందాదేవి’ షిప్ INDకు <<19406038>>చేరుకుంది<<>>. పైపుల ద్వారా గ్యాస్ను పంపించేందుకు దానిని -40°Cకు చల్లబరుస్తారు. ఓడరేవుకు షిప్ రాగానే దానికి పైపులను అటాచ్ చేసి ప్రెజర్ పంపుల ద్వారా ద్రవ రూపంలో ఉన్న గ్యాస్ను తీరంలోని స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ వడపోసిన తర్వాత గ్యాస్ లీక్ అయితే గుర్తుపట్టడానికి ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఆ తర్వాత ఖాళీ సిలిండర్లలో సరైన పరిమాణంలో గ్యాస్ నింపి సీల్ వేస్తారు.
News March 17, 2026
సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.


