News October 5, 2024

కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 12 మంది డిప్యూటీ ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ జేసీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత స్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసినట్లు జేసీ పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

కడప: ‘మా కుమార్తెను కువైట్‌లో అమ్మేయాలని చూస్తున్నాడు’

image

మత మార్పిడితో ఓ వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన భూషణ్ రెడ్డి కుమార్తెను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వాళ్లు రూ.4.8 లక్షల నగదు, 26 తులాల బంగారం తీసుకెళ్లారని, పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేశారని తన కుమార్తెను సౌదీలో అమ్మేస్తాడేమోనని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

News October 5, 2024

కడప జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత ప్రదేశాలలో రిపోర్ట్ చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.

News October 5, 2024

మైదుకూరు: అవకతవకలపై 15 మందికి నోటీసులు

image

కడప జిల్లా మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారి సంజాయిషీలను సమర్పించాలని ఆదేశించినట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు.. రీ ఎంక్వయిరీ చేసి అక్కడ అవకతవకలు, తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్‌తోపాటు 14 మంది వీఆర్వోలకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.