News October 5, 2024
భయానకం.. 600 మందిని కాల్చేశారు

ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో అల్ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ JNIM దాడుల్లో గంటల వ్యవధిలోనే 600 మంది ప్రజలు చనిపోయారు. AUG 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్లపై వచ్చిన దుర్మార్గులు కనిపించినవారినంతా కాల్చేశారు. ఆ మృతదేహాలను తొలగించడానికి 3 రోజలు పట్టింది. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20వేల మంది మరణించారు.
Similar News
News March 4, 2026
పైల్స్ అని చూపించినా.. లీవ్ ఇవ్వలేదు!

లక్నో రైల్వే డివిజన్లో సిక్ లీవ్ కోసం ఓ లోకో పైలట్ ప్యాంట్ విప్పాల్సి రావడం హాట్ టాపిక్గా మారింది. పైల్స్ సర్జరీ చేయించుకున్న రాజేశ్ అనే లోకో పైలట్ రెస్ట్ కోసం లీవ్ అడగ్గా పైఅధికారి రతన్ నమ్మలేదు. తగిన మెడికల్ రిపోర్టులు చూపినా రిజెక్ట్ చేశారు. మనస్తాపంతో రాజేశ్ తన గాయాలను చూపించేందుకు ప్యాంట్ విప్పారు. అయినా అధికారి లీవ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. యూనియన్ నాయకుల జోక్యంతో సెలవు మంజూరైంది.
News March 4, 2026
ఇరాన్కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్కు?

ఇరాన్ ‘షాహెద్’, అమెరికా ‘LUCAS’లకు దీటుగా భారత్ శేష్నాగ్-150 డ్రోన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులోని NRT సంస్థ అభివృద్ధి చేస్తోన్న ఈ డ్రోన్ 25-40kgల ఆయుధాలతో 1,000km దూరంలోని టార్గెట్స్ను రీచ్ అవుతుంది. GPS సిగ్నల్స్ లేని చోట ‘విజువల్ నావిగేషన్’తో పనిచేయడం దీని స్పెషాలిటీ. యుద్ధ క్షేత్రంలో సొంత ఇంటెలిజెన్స్తో నిర్ణయాలు తీసుకొని దగ్గర్లోని ఇతర డ్రోన్లతో ఇది కమ్యూనికేట్ చేయగలదు.
News March 4, 2026
44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<


