News October 5, 2024
రికార్డు సృష్టించిన హర్మన్ ప్రీత్

మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక ఎడిషన్లకు కెప్టెన్సీ చేసిన భారత కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పారు. ఆమె ఇప్పటివరకు 4 ఎడిషన్లలో (2018, 2020, 2023, 2024) టీమ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆమె తర్వాత మిథాలీ రాజ్(2012, 2014, 2016), జులన్ గోస్వామి (2009, 2010) ఉన్నారు.
Similar News
News March 13, 2026
NGKL: 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 265 పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
News March 13, 2026
మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
News March 13, 2026
మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.


