News October 5, 2024
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.
Similar News
News March 18, 2026
ఒంగోలు: దివ్యాంగుల సాధికారతకు ‘శక్తి’ పథకం ప్రారంభం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
News March 18, 2026
తాళ్లూరు: లేఔట్లను పరిశీలించిన జేసీ

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
News March 18, 2026
ప్రకాశ: విద్యుత్ వినియోగదారులకు ఎస్ఈ సూచనలు

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. గడువు లోపు చెల్లిస్తే సర్ ఛార్జ్, పెనాల్టీ పడదని అన్నారు. జిల్లాలో కోట్ల రూపాయల మేర బిల్లు బకాయిలు విద్యుత్ సంస్థకు పెనుభారంగా మారాయని ఆయన తెలిపారు. ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చు అని తెలిపారు.


