News October 5, 2024
కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన KTR

TG: తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తొలిసారి స్పందించారు. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్పైనా వేస్తా’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి KTR కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.
Similar News
News February 2, 2026
కాళ్లు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటికి వెళ్లేటపుడు సన్స్క్రీన్ రాయాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ సి, హైడ్రోక్వినోన్లలో ఏదో ఒకటి ఉన్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News February 2, 2026
పాక్ ఉక్కిరిబిక్కిరి.. మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారారు!

పాకిస్థాన్ అధీనంలోని బలూచిస్థాన్లో ఉద్రిక్తతలు చల్లారట్లేదు. పాక్ సైన్యంపై రెబల్స్ విరుచుకుపడుతున్నారు. మహిళలు సూసైడ్ బాంబర్లుగా మారి పాక్ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆసిఫా మెంగల్ (24) అనే సూసైడ్ బాంబర్, మరో మహిళా ఫైటర్ చేసిన దాడుల్లో 50 మంది చనిపోగా అందులో 17 మందికిపైగా పాక్ జవాన్లు ఉన్నారు. 200 మంది పాక్ జవాన్లను చంపామని, 17 మందిని బంధించామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
News February 2, 2026
రూ.9.8 కోట్ల లెక్కలేవి? KCRకు సిట్ ప్రశ్న!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ముందు సిట్ అధికారులు కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంటెలిజెన్స్ టీం అత్యాధునిక పరికరాలు వాడిందని, వాటి విలువ దాదాపు రూ.9.8 కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ ముందు వివరాలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరికరాల కొనుగోలు లెక్కల గురించి ఆయనను సిట్ ప్రశ్నించగా ఈ విషయం తనకు తెలియదంటూ KCR సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.


