News October 5, 2024
సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్ లాహోటిలకు సమన్లు

సెబీ, ట్రాయ్ల పనితీరుపై పార్లమెంటు PAC ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ మేరకు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమీక్షకు రెండు సంస్థల నుంచి మాదబీ, లాహోటిల తరఫున సీనియర్ అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కమిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఈ సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News March 31, 2026
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి
News March 31, 2026
హార్ముజ్పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.
News March 31, 2026
హార్ముజ్పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.


