News October 5, 2024

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఇకపై అహిల్యానగర్‌

image

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాను అహిల్యానగర్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యా దేవి పేరును ఆ జిల్లాకు పెట్టాలంటూ చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది సరిగ్గా ఆమె 300వ జయంతి సందర్భంలో పేరు మారడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 22, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News March 22, 2026

చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

image

దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యధిక రోజులు(8,931) ప్రభుత్వాధినేతగా(గుజరాత్ CM+ దేశ PM) పని చేసిన వ్యక్తిగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ CM పవన్ చామ్లింగ్(8,930) రికార్డును బ్రేక్ చేశారన్నారు. మోదీ గుజరాత్ CMగా 12 ఏళ్ల 227 రోజులు పనిచేశారు. PMగా నేటితో 11 ఏళ్ల 299 రోజులు పూర్తి చేసుకున్నారు.

News March 22, 2026

ఆ 2 గంటలు చాలా ముఖ్యం!

image

<<19446288>>సైబర్<<>> మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే <>CyberCrime.gov.in<<>> పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డులను వెంటనే బ్లాక్ చేయించి, మోసపూరిత లావాదేవీ గురించి బ్యాంకుకు సమాచారం అందించాలి. మోసం జరిగిన మొదటి 1-2 గంటల్లో కంప్లైంట్ ఇవ్వగలిగితే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.