News October 5, 2024
రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..

అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!
Similar News
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ను నియమించినట్లు మీడియా చిట్చాట్లో తెలిపారు.
News March 18, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 18, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


