News October 5, 2024
నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి

వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News March 26, 2026
CSK బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు.. ఓపెనర్స్ ఎవరంటే?

ఈ ఏడాది IPLలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయనున్నట్లు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. సంజూ శాంసన్, తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని కెప్టెన్స్ డే ఈవెంట్లో తెలిపారు. ఈ సీజన్లో ఆయుష్ మాత్రే ఓపెనర్గా దిగడం లేదని చెప్పారు. దీంతో అతను మూడో స్థానంలో, బ్రెవిస్ ఫోర్త్ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ఆరంభంలో చెన్నై ఓపెనింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
News March 26, 2026
చరణ్కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

‘పెద్ది’ చిత్ర షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


