News October 5, 2024

అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి: జేసీ

image

ప్రధాన మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలపై అవగాహన కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో టీబీ నియంత్రణకు చేపట్టే కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

Similar News

News October 6, 2024

ఖరీఫ్ పంటల సాగు, సమస్యలపై శాస్త్రవేత్తల సమావేశం

image

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు, సమస్యల గురించి ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో జులై, సెప్టెంబర్ మాసాలలో తక్కువ వర్షపాతం వల్ల దిగుబడులు తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

News October 5, 2024

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు

image

అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News October 5, 2024

‘ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి.. ఆదర్శ గురువులుగా మారి’

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుదర్శన రావు, శశిధర్ అనేక మంది విద్యార్థులను ఇంజినీర్లుగా మార్చారు. గతంలో వారి ప్రభుత్వ ఇంజినీర్ ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి ప్రొఫెసర్లుగా బోధన మార్గాన్నే ఎంచుకొని ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాలలో ఇంజినీర్లుగా, పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో JE, AE, AEEలుగా తీర్చదిద్దారు.