News October 5, 2024
పిల్లల భద్రత.. మన అందరి బాధ్యత: సిద్దిపేట సీపీ

దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 28, 2026
మెదక్: ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమాన్ని మెదక్ టౌన్లోని ఓ గార్డెన్లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు తెలిపారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
News March 28, 2026
MDK: ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 413 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
News March 27, 2026
MDK: శ్రీరామనవమి.. ఎస్పీ ప్రత్యేక పూజలు

శ్రీరామనవమి సందర్భంగా మెదక్ టౌన్లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎస్పీ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. శాంతిభద్రతల కోసం పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేష్, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


