News October 6, 2024
‘పుష్ప2’: త్రిప్తిని సుకుమార్ రిజెక్ట్ చేశారా?

‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘పుష్ప2’ ఐటమ్ సాంగ్లో సందడి చేయబోతున్నారని కొద్దికాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమెను సుకుమార్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆమె కొత్త మూవీ ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లోని ‘మేరే మెహబూబ్’లో స్టెప్పులు వేయగా దానిపై విపరీతమైన ట్రోలింగ్ రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పునరాలోచనలో పడ్డ సుక్కు ఆమెను ఆడిషన్స్లోనే తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News December 31, 2025
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్లోనూ అన్వేష్పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
News December 31, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.


