News October 6, 2024
ఐదో రోజు అట్ల బతుకమ్మ
TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.
Similar News
News October 6, 2024
ఘోరం.. కుటుంబంలో ఒక్కడే మిగిలాడు!
AP: ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో చీకట్లు నింపింది. చిత్తూరు జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్కు అలవాటు పడి ఏడాది క్రితం ఇంటి స్థలాన్ని అమ్మేశాడు. అయినా వదలక మరిన్ని అప్పులు చేశాడు. సొంతింటిపై లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగు మందు తాగారు. ముగ్గురు చనిపోగా, దినేశ్ పరిస్థితి విషమంగా ఉంది.
News October 6, 2024
TTDకి లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తా: రామచంద్రయాదవ్
AP: తిరుమలలో ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును BCY పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కోరారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖ రాశారు. మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పారు. ‘వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయి. ఇందులో నుంచి 50వేల కేజీల వెన్న తీసి 30వేల కేజీల నెయ్యి తయారుచేయొచ్చు’ అని పేర్కొన్నారు.
News October 6, 2024
రూ.2,000 రావాలంటే ఇలా చేయాల్సిందే..
ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ 18వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కాకుంటే PM కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
>>SHARE IT