News October 6, 2024

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తోంది: మహేశ్ కుమార్

image

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన NZBలో మీడియాతో చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్‌గా హైదరాబాద్ పరిస్థితి మారకూడదంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు.

Similar News

News October 6, 2024

నిజామాబాద్: ముగ్గురు ఆత్మహత్య..UPDATE

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

News October 5, 2024

NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్

image

రుణ మాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.