News October 6, 2024

డ్వాక్రా మహిళలకు ‘స్ఫూర్తి’ పథకం.. వివరాలివే

image

AP: రైతులు, చేతివృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ ‘స్ఫూర్తి’ పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత 11 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో క్లస్టర్‌లో 1,000-1,500మంది మహిళలుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం రూ.5కోట్లు(ఇందులో 90% రాయితీ) ఇస్తుంది. రైతులు, చేతివృత్తిదారుల నుంచి ధాన్యం, వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

News January 12, 2026

BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

image

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

News January 12, 2026

మినుము పంట పూత, పిందె దశల్లో పల్లాకు తెగులు నివారణ ఎలా?

image

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎకరాకు డైమిథోయేట్ 400ml లేదా థయోమిథాక్సాం 40గ్రా. లేదా అసిటామిప్రిడ్ 40 గ్రా. లేదా ఎసిఫేట్ 200 గ్రాములను 200 లీటర్ల నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. దీంతో పాటు ఎకరానికి 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అమర్చి ఈ తెగులును నియంత్రించవచ్చు.