News October 6, 2024
ENCOUNTER: మృతుల్లో 13 మంది మహిళలు

ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించగా, అందులో 13 మంది మహిళలు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలిపారు. అందులో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ఇన్ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ కూడా ఉన్నారని, ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
జూన్ నెల శ్రీవారి దర్శన కోటా టికెట్ల వివరాలు

☛ ఈ నెల 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
☛ 21న శ్రీవారి ఆర్జిత సేవా, వర్చువల్ ఆర్జిత సేవా టోకెన్ల విడుదల
☛ 23న 10AMకి అంగప్రదక్షిణం ఫ్రీ టికెట్స్, 11AMకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఆన్లైన్ కోటా, 3PMకి సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా
☛ 24న 10AMకి స్పెషల్ ఎంట్రీ (₹300) దర్శనం టికెట్లు, 3 PM నుంచి గదుల కోటా
News March 16, 2026
రూ.3లక్షల కోట్లకు పైగా బడ్జెట్… చర్చ 6 రోజులే!

TG: అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కుదించుకుపోతోంది. FY25-26లో ₹3.04L కోట్ల బడ్జెట్ పెట్టగా సభ 11 రోజులు జరిగింది. GOVR ప్రసంగం, ధన్యవాదాలు, బడ్జెట్ ప్రవేశానికి 4రోజులు పోను బడ్జెట్పై చర్చ 7రోజుల్లో ముగిసింది. ఈసారి బడ్జెట్ గతం కన్నా పెరిగే అవకాశముంది. ప్రస్తుత సమావేశాలు ఈనెల 30వరకు ఉంటాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, ఆదివారాలు పోను మొత్తం పనిదినాలు 10 రోజులే. అందులో బడ్జెట్పై చర్చించేది 6 రోజులే.
News March 16, 2026
రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు: CM

TG: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. ‘అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికలకు అజెండా అవుతుంది’ అని దిశానిర్దేశం చేశారు.


