News October 6, 2024
NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.
Similar News
News March 16, 2026
డిచ్పల్లి: టీయూలో రేపు మెగా జాబ్ మేళా

టీయూలో ట్రైనింగ్&ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో రేపు డిచ్పల్లి క్యాంపస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు మాట్లాడుతూ.. 50కుపైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. IT, ఫార్మా, నర్సింగ్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో 5,000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.
News March 16, 2026
NZB: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: MP

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని MPఅర్వింద్ ధర్మపురి కోరారు. జిల్లా కలెక్టర్కు ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట పండిందని అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవన్నారు.
News March 16, 2026
స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సందర్శించాలి: NZB కలెక్టర్

మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని గ్రామ సభలను సందర్శించాలని ఆదేశించారు.


