News October 6, 2024
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్-14 విభాగంలో హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమేశ్ బాబు, పీడీ అజీమ్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన ఓం శ్రీ, ఫర్హాన్ అనే విద్యార్థినులు ఎంపిక అయ్యారన్నారు.
Similar News
News October 6, 2024
రేపు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలచే వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News October 6, 2024
రేపు JNTUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం జేఎన్టీయూలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి MBAలో 9 సీట్లు, MCAలో 4 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీలోని పరిపాలన భవనం నందు సోమవారం ఉదయం 9.00 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
News October 6, 2024
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం మండలం దేవరపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం ఉదయం పోలీసులు గుర్తించారు. ఆయన వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నట్లు తెలిపారు. విషం తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడి సమాచారం తెలిస్తే హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో తెలపాలని కోరారు.