News October 6, 2024
RBI వడ్డీరేట్ల కోత లేనట్టేనా!

RBI MPC అక్టోబర్ మీటింగ్లో రెపోరేట్ల కోత ఉండకపోవచ్చని సమాచారం. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు కమిటీ భావిస్తోందని తెలిసింది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. దీంతో ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీరేట్ల కోత కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. 2023, ఫిబ్రవరి నుంచి రెపోరేట్ 6.5 శాతంగా ఉంది.
Similar News
News March 5, 2025
విద్యార్థులు ఇలా చేస్తే పరీక్షలు ఈజీగా రాయొచ్చు!

☛ ఎగ్జామ్ టైమ్లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి, ముందుగా తెల్సినవి రాయాలి. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు.
☛ పరీక్షలకు ముందు చదవడంతో పాటు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
☛ క్లాస్లు జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫాస్ట్గా రాయడం అలవాటౌతుంది.
☛ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రీ ఫైనల్స్ రాయాలి. దీని వల్ల టైమ్ మేనేజ్మెంట్ అలవడుతుంది.
News March 5, 2025
సంప్రదాయమేనా? సర్ప్రైజ్ ఉంటుందా?

TG: కాంగ్రెస్లో MLA కోటా MLC పదవులకు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ MLC జీవన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. One Leader One Post నిర్ణయంతో నరేందర్ను, ఇప్పటికే చాలా ఛాన్సులు పొందారని జీవన్ను రెడ్డి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియార్టీ సంప్రదాయాన్ని కాదని OLOPతో పాటు యువరక్తంపై మొగ్గు చూపితే సామ రామ్మోహన్ రెడ్డి వంటి వారికీ సర్ప్రైజ్ ఛాన్స్ రావచ్చు.
News March 5, 2025
రాజధానిపై జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదని, YCP నేతల మాటలు నమ్మొద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిపై మాజీ CM జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. రూ.63వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు, బడ్జెట్లో రూ.6వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 1200 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చుదిద్దుతామన్నారు.