News October 6, 2024
కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి

స్థానిక RTC బస్స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News April 1, 2026
అనంతపురం జిల్లాలో 102.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లాలో 102.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మండలాల వారీగా గుత్తిలో 31.2 మి.మీ, కంబదూరులో 34.6 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే సెట్టూరు 14.6 మి.మీ, వజ్రకరూరు 5.8 మి.మీ, బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
News March 31, 2026
నిబంధనలు పాటించలేదా ఇకపై చర్యలు తప్పవు: ఏఎస్పీ

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు భద్రతే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తాడిపత్రి బైపాస్లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని పలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్మెట్లు ధరించని వాహనదారులకు రూ.1,035 జరిమాన విధించారు. హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.
News March 30, 2026
సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దాం: కలెక్టర్

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.


