News October 7, 2024
‘డీఎస్సీ 2008 ఏజెన్సీ అభ్యర్థుల జాబితా సవరించాలి’

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్సీ 2008 అర్హుల జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని, వాటిని సవరించి కొత్త జాబితా విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకులు కల్తి రాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కారేపల్లిలో జరిగిన డీఎస్సీ 2008 బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియా గిరిజన అభ్యర్థుల లిస్టుల తయారీలో జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించాలన్నారు.
Similar News
News March 18, 2026
ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.
News March 18, 2026
క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: ఖమ్మం DMHO

హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని DMHO రామారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 14-15 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేస్తున్నామని, ఈ నెల 8న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 16వ తారీకు వరకు 1300 మందికి వ్యాక్సిన్ అందించామని వెల్లడించారు.
News March 17, 2026
నాలుగేళ్లలో ఫసల్ బీమా క్లెయిమ్లు: కేంద్రం

దేశవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కల్పిస్తున్న ఆర్థిక భరోసాపై ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా భారీ స్థాయిలో క్లెయిమ్లు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు.


