News October 7, 2024

మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?

image

TG: సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 25, 2026

ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

image

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.

News March 25, 2026

లాస్ట్ మినిట్ డుమ్మాతో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది: గంగూలీ

image

టీమ్ ఇండియా కంటే IPL టీమ్‌ను నిర్మించడమే కష్టమని గంగూలీ అన్నారు. ‘భారత జట్టుకైతే బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ IPLలో ప్లేయర్స్ 10 టీమ్స్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇలాంటి టైమ్‌లో క్వాలిటీ ప్లేయర్స్ లాస్ట్ మినిట్‌లో రాకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది’ అని గంగూలీ అన్నారు. మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఈ కామెంట్స్ చేశారు.