News October 7, 2024
మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.
News March 8, 2026
నిజామాబాద్ జిల్లాలో ‘అతివలదే’ అధికారం

NZB జిల్లా ప్రగతి పథానికి మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన జడ్జీగా భరత లక్ష్మీ, DMHOగా డా.రాజశ్రీ, జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా పద్మశ్రీ, RTC RMగా జ్యోత్స్న జిల్లా పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాకుండా పలు శాఖల్లో అధికారులుగా మహిళలు రాణిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
News March 8, 2026
NZB: కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

కేంద్రీ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను భర్తీకి సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర రావు తెలిపారు. నిజామాబాద్, బోధన్లోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయులను నియమించడానికి NZB కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆయన సూచించారు.


