News October 7, 2024

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు.?

image

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు GMC అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రి 10 గంటల తర్వాత భోజనం, టిఫిన్, హోటల్‌లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు ఆహార ప్రియులు కోరుకున్న పదార్థాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. 4ఏళ్ల కిందట ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా కరోనాతో అవి కనుమరుగయ్యాయి.

Similar News

News July 10, 2025

GNT: ‘అరటిగెల కోసే కత్తితో పొడిచి చంపారు’

image

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.

News July 10, 2025

16వ తేదీ లోపు వివరణ ఇవ్వాలి: కలెక్టర్

image

భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ
నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎందుకు పోటీ చేయలేదనే అంశాలపై 6 రోజుల్లో లిఖిత పూర్వకంగా ప్రధాన ఎన్నికల అధికారికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News July 10, 2025

గుంటూరులో గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్ట్

image

గుంటూరు శివ నాగరాజు కాలనీలో గంజాయి విక్రయిస్తున్న గోపి, కార్తికేయలను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ లతా తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 253 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు షరీఫ్, తిరుమలేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.