News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

Similar News

News October 7, 2024

‘సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనానికి తీర్మానం’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.

News October 7, 2024

విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

పీఎం పాలెంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పీఎం పాలెం చివరి బస్‌స్టాప్ వద్ద ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు విజయనగరానికి చెందిన కేశల అప్పలరాజు(35)గా గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News October 7, 2024

ఆరోజే అందరూ కలిసి వచ్చి ఉంటే బాగుండేది: పవన్ కళ్యాణ్

image

‘విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్దామంటే ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆరోజు అందరూ కలిసి వచ్చి ఉండుంటే, ఈరోజు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదు కాదు’ అని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సోమవారం మంగళగిరి క్యాంప్ ఆఫీసులో స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో జరిగిన సమావేశంలో అన్నారు.