News October 7, 2024
రంపచోడవరం: CRPF జవాన్ మృతి

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2026
రాజమండ్రిలో అక్రమాల డొంక లాగుతున్న ACB

రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు రోజులుగా ACB అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. కార్యాలయంలోని సుమారు 700 పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. గురువారం నగరవ్యాప్తంగా ACB బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించనుంది.
News March 10, 2026
రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరణ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News March 10, 2026
రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరణ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


