News October 7, 2024

కాసేపట్లో చంద్రబాబును కలవనున్న మల్లారెడ్డి

image

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బాబుతో భేటీ అవుతారని సమాచారం.

Similar News

News October 7, 2024

చెరువులపై సమగ్ర అధ్యయనం.. 3 నెలల్లో సర్వే పూర్తికి ఆదేశం

image

TG: HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల్లో సర్వే పూర్తి చేసి చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. సర్వే పూర్తయ్యాక ఆ వివరాలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News October 7, 2024

అద్భుతమైన ఫొటోలు

image

చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోకు లక్షలాదిగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ షోలో ఆకాశం మీద నుంచి జెట్ విమానాలను తీసిన ఫొటోలు తాజాగా వైరలవుతున్నాయి. సముద్రం, పక్కనే చెపాక్ క్రికెట్ స్టేడియం, పొగలు కక్కుతూ దూసుకెళ్తోన్న జెట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో చెన్నై అందాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఎయిర్ షోకు భారీగా జనం పోటెత్తడంతో ఐదుగురు మరణించారు.

News October 7, 2024

నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!

image

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్‌ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.