News October 7, 2024
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.
Similar News
News March 4, 2026
KNR: సోలార్ విద్యుత్పై అవగాహన వాహనం ప్రారంభం

‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే KNR కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో 99 రోజుల పాటు జిల్లాలోని 16 మండలాల్లో ఈ వాహనం పర్యటించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని అన్నారు.
News March 4, 2026
KNR: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో హోలీ సంబరాలు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండుగ సందర్భంగా మహిళా విద్యార్థులతో సహజ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత దృక్పథంతో, ఆరోగ్య రక్షణను ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో రసాయనిక రంగులను పూర్తిగా నివారించి సహజ పూలు, ఔషధ గుణాలున్న వనరులతో రంగులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News March 4, 2026
కరీంనగర్ జిల్లా కోర్టులో ఘనంగా హోలీ వేడుకలు

కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్టు ప్రాంగణం రంగులతో కళకళలాడింది.


